
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు, త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో స్థానిక 42వ డివిజన్,కామాక్షినగర్, అయ్యన్నపేట మున్సిపల్ వాకింగ్ ట్రాక్ వద్ద అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ మజ్జిగ చలివేంద్రం శిబిరంలో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్బంగా త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుంబిగించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి, వాటియొక్క నష్టాలను ప్రజలకు తెలిసేలా చేయాలని,ప్రతీఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు.